Modi : ఉద్రిక్తత తగ్గించుకుని శాంతి నెలకొల్పండి : ఇరాన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్

X
By - Manikanta |23 Jun 2025 1:15 PM IST
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబర్లతో దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. 'ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. సైనిక వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. ఉద్రిక్తతలను తగ్గించుకుని శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చాను. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలి" అని పోస్టులో మోడీ చెప్పారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com