Maharashtra CM : సీఎం పదవికి షిండే రాజీనామా

Maharashtra CM : సీఎం పదవికి షిండే రాజీనామా
X

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, ముఖ్యనేతలు ఉన్నారు. కొత్త ప్ర భుత్వం కొలువుదీరే వరకు ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలన గడువు ఇవాల్టితో ముగి యనుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహా రాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైంది. మెజార్టీ సీట్లలో బీజేపీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 132, శి పసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ లో సీఎం అవకాశం ఉంటుందనే వార్తలు వస్తు న్నాయి. శివసేన (షిండే) పార్టీ మాత్రం ఏక్ నాథ్ షిండేకు మరో సారి అవకాశం ఇవ్వాల పట్టుబడుతోంది. అజిత్ పవార్ సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను దేవేంద్ర ఫడ్నవిస్ కు మద్దతు ఇస్తు న్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనేది బీజేపీ అధినాయకత్వం నిర్ణయించే అవకాశం ఉంది

Tags

Next Story