Maharashtra: వీడియో కోసం కారుతో విన్యాసం.. 300 అడుగుల లోయలో పడిపోయిన యువకుడు..

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న చిత్ర విచిత్రమైన విన్యాసాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లో చేసే విన్యాసాలతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ టూరిజం ప్రదేశంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పఠాన్- సదావాఘాపుర్ మార్గంలోని ఓ కొండ పైన బుధవారం నాడు కరాడ్లోని గోలేశ్వర్కు చెందిన సాహిల్ జాదవ్, తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్లేస్ కి వచ్చాడు. రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
అయితే, గుజర్వాడి ప్రాంతంలోని పఠాన్ నుంచి 3-4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ టూరిజం ప్లేస్ లో నిత్యం పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. పెద్ద లోయగా ఉండే ఈ ప్రాంతంలో భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు మాత్రం కనపడవు. దీంతో ఇక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ వెంటనే భద్రతా రెయిలింగ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com