Supreme Court : ప్రత్యేక బెంచు .. అలీగఢ్ యూనివర్శిటీ మైనార్టీ స్టేటస్

Supreme Court : ప్రత్యేక బెంచు .. అలీగఢ్ యూనివర్శిటీ మైనార్టీ స్టేటస్
X

అలీగఢ్ ముస్లీం యూనివర్శిటీకి మైనార్టీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వె లువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ తీర్పును చదివి వినిపించారు. 1920లో స్థాపించబడిన భారత రాజ్యాంగం ప్రకారం అలీగఢ్ మైనార్టీ యూనివర్శిటీని మైనారిటీ సంస్థగా ఉంచేందుకు అర్హత ఉందా లేదా అనే దానిపై దీర్ఘకాలంగా చర్చ జరుగుతో ది. దానిని పరిష్కరించేందుకు న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే అలీగఢ్ యూనివర్శి టీ సెంట్రల్ యూనివర్శిటీ అయినంత మాత్రాన మైనార్టీ హోదా ఉండదని 1967 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనంలోని సీజేఐ డీవై చం ద్రచూడ్ సహా జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా తోసిపుచ్చారు. తీర్పును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్ సీ శర్మ వ్యతిరేకించగా 4:3 మెజార్టీతో తీర్పు వెల్లడైంది. అలీగఢ్ యూనివ ర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశాన్ని తేల్చేపనని ధర్మాసనం ముగ్గురు జడ్జిల ప్రత్యేక బెంచ్ కు అప్పగించింది.

Tags

Next Story