Supreme Court : టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో షాక్

Supreme Court : టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో షాక్
X

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు ఇతర టెలికాం కంపెనీలు లకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తమ అడ్జెస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ(ఏజీఆర్‌) బకాయిలపై సుప్రీం నిర్ణయాన్ని పునర్విచారించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ధర్మాసనం కొట్టేసింది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ఇతర కంపెనీలు 2019లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై గతేడాది క్యూరేటివ్‌ పిటిషన్‌ ఫైల్ చేశాయి. దీనిపై ఓపెన్‌ కోర్టులో నిర్ణయం ప్రకటించాలని వేడుకున్నాయి. టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌ (డీవోటీ) ఏజీఆర్‌ బకాయిల గణనలో భారీ తప్పిదం చోటు చేసుకొందని కంపెనీలు వాదనలు వినిపించాయి. తమ పిటిషన్‌ను ఓపెన్‌ కోర్టులో ఎంక్వైరీ చేయాలని.. ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్‌ గతేడాది కోర్టును కోరాయి.ఈ ఏజీఆర్‌ ఛార్జీలు ప్రభుత్వం- కంపెనీలు ఆదాయం పెంచుకునే విధానంలో ఉన్నాయని తెలిపాయి. దీని కిందే లైసెన్సింగ్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఫీజలు చెల్లిస్తాయని పేర్కొన్నాయి. కానీ, డీవోటీ మాత్రం ఏజీఆర్‌లో శాతాలుగా గణించాయని చెప్తున్నాయి. 2005 నుంచి ఏజీఆర్‌ అనేది ఇబ్బందికర అంశంగానే మారిందని ఐడీయా- ఎయిర్ టెల్ కంపెనీలు పేర్కొన్నాయి. తాజాగా దాఖలైన క్యూరేటివ్‌ పిటిషన్‌ సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌కుమార్‌, జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌లతో కూడిన ధర్మాసనం వద్ద క్యూరేటివ్‌ పిటిషన్‌ లిస్టైంది. కానీ, దీనిని నేడు న్యాయస్థానం తిరస్కరించింది. సాధారణంగా ఇటువంటి పిటిషన్లను న్యాయమూర్తులు ఛాంబర్‌లో పరిశీలించి విచారణకు అర్హమైనవో, కాదో నిర్ణయిస్తారు. ప్రత్యేకమైన అభ్యర్థనలు ఉంటే ఓపెన్‌ కోర్టు విచారణను అనుమతిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజాగా న్యాయస్థానం నిర్ణయం వెలువడటంతో వొడాఫోన్‌ ఐడియా షేర్లు 10 శాతానికి పైగా పడిపోయాయి.

Tags

Next Story