Supreme Court : యూపీ సర్కారుకు సుప్రీం షోకాజ్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కుషీనగర్ లోని మసీదును అక్రమ కట్టడం పేర్కొంటూ కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుధిక్కార చర్యలకు పాల్పడిన సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ప్రశ్నించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్ లతో కూడిన ధర్మాసనం యూపీ సర్కారుకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. కుషీనగర్ మసీద్ కేసులో తదుపరి కూల్చి వేత చర్యలను నిషేధించింది. మద్ని మసీదు కొంత భాగా న్ని అధికార యంత్రాంగం కొంత మేరకు కూల్చివేసింది. | వాస్తవానికి భూమిని ఆక్రమించి మసీదును నిర్మించారని ఆరోపణలున్నాయి. ఈ నెల ప్రారంభంలో మసీదులోని కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com