Arvind Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీం తీర్పు

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించనుంది. ఈ నెల 5న ధర్మాసనం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్నది. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు.కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. ‘‘కేజ్రీవాల్ దేశం విడిచి వెళ్లే ఛాన్సే లేదు. ఆయన కరుడుగట్టిన నేరగాడు కాదు. బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ ఢిల్లీలోనే ఉంటారు’’ అని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్పై తీర్పును సెప్టెంబరు 13వ తేదీకి రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చినందున..ఇక కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com