Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం

Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం
X

కేంద్రానికి వ్యతిరేకంగా.. తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వక్స్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీజీపీ ప్రభుత్వం చేసిన సవరణలు మైనార్టీ హక్కులను హరించే విధంగా ఉన్నాయని సీఎం స్టాలిన్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాల హక్కులకు, సంస్కృతులకు, సంప్రదాయలకు వ్యతిరేకంగా ఉన్నాయని స్టాలిన్ మండిపడ్డారు. విభిన్న సంస్కృతులకు, భాషలకు భారత్ నిలయమని కొనియాడారు. కానీ మోడీ దక్షిణాది రాష్ట్రాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వక్స్ బిల్లులో కేంద్రం చేసిన సవరణలు ముస్లీం వర్గాలకు ప్రతికూలంగా ఉందని, వారి రాజ్యాంగం హక్కులు కేంద్రం కాలారాస్తుందని ఎంకే స్టాలిన్ ఆరోపించారు. మైనార్టీల సంక్షేమాన్ని, వాళ్ల హక్కులను గురించి మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. మైనార్టీలకు మద్దతుగా వక్స్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గిస్తోందని, ఇద్దరు మైనార్టీయేతర వ్యక్తులను బోర్డులో నియమించడం ఎంతవరకు సమజసమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మత స్వేచ్ఛ హక్కును హరించడమే కాకుండా, వక్స్ బోర్డు ఆస్తులకు ముప్పు పొంచి ఉందని ఎంకే స్టాలిన్ వివరించారు.

Tags

Next Story