Ahmedabad : ఫ్లైట్ క్రాష్ టైంలో వెయ్యి డిగ్రీల టెంపరేచర్

Ahmedabad : ఫ్లైట్ క్రాష్ టైంలో వెయ్యి డిగ్రీల టెంపరేచర్
X

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ క్రాష్ ఘటన యావద్ దేశాన్ని కలచివేసింది. వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైందన్నారు. విమానం కుప్పకూలిన ఘటనల 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విశ్వాస్‌ కుమార్ రమేశ్ ఒక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. అయితే, విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై కుప్పకూలడంతో మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు

Tags

Next Story