MP Shashi Tharoor : ఉగ్రవాదం ప్రపంచ సమస్య .. అందరూ కలిసి పోరాడాల్సిందే

MP Shashi Tharoor : ఉగ్రవాదం ప్రపంచ సమస్య .. అందరూ కలిసి పోరాడాల్సిందే
X

ఉగ్రవాదం ప్రపంచ సమస్య అని, చాలా దేశాలు దాని బారిన పడ్డాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కలిసి కట్టుగా పోరాటం చేయడమే ఇందుకు పరిష్కారమని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మన త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఏడు పార్లమెంట్ బృందాలను పంపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శశిథరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రస్తుతం యూఎస్లో పర్యటిస్తుంది. 2001లో అమెరికాలో జరిగిన ట్విట్ టవర్స్ పేల్చివేత ఘటనలో చనిపోయిన గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారక ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూఎస్లో పర్యటించిన ప్రతినిధి బృందంలో బీజేపీ ఎంపీలు భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి, శివసేన ఎంపీ మిలింద్ దేవరా, టీడీపీ ఎంపీ జీఎం హరీశ్ బాలయోగి తదితరులున్నారు.

Tags

Next Story