Terrorist Warning : వెళ్లి మోడీకి చెప్పుకో..! ఉగ్రవాది ఏమన్నాడంటే!

Terrorist Warning : వెళ్లి మోడీకి చెప్పుకో..! ఉగ్రవాది ఏమన్నాడంటే!
X

కాల్పుల తర్వాత ఓ ఉగ్రవాది వెళ్తూ వెళ్తూ.. ఈ సంఘటన గురించి వెళ్లి మోడీకి చెప్పుకో.. అంటూ బాధితురాలిని హెచ్చరించాడు. తాజా దాడిలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన మంజునాథ్ మరణిం చాడు. కళ్ల ముందే తన భర్తను కిరాతకంగా కాల్చి చంపడంతో ఆమె షాక్కు గురైంది. భయానక క్షణాల గురిం చి మాట్లాడుతూ.. నేను.. నా భర్త.. కుమారుడు.. ముగ్గురం పహల్గాం చేరుకున్నాం. మధ్యా హ్నం 2.30 గంటల సమయం అనుకుంటా.. ముష్కరులు ఉన్నపలంగా కాల్పులు జరిపారు. ముష్కరులు హిందువులను టార్గెట్ చేశారు. మాపై ముగ్గురు నలుగురు దాడిచేశారు. నా భర్త అక్కడికక్కడే మరణించాడు. నా భర్తను చంపారు.. నన్నూ చంపేయండి అని గట్టిగా అరిచాను. దాంతో ముష్కరుల్లో ఒకరు.. నిన్ను నేను చంపను.. వెళ్లు.. ఇక్కడ జరిగింది మోడీకి చెప్పుకో అని హెచ్చరించాడు. ఇప్పటికీ ఇదొక " పీడకలగా అనిపిస్తోంది. కొందరు స్థానికులు నన్ను, నా కుమారుడిని అక్కడి నుంచి కాపాడారు అని మృతుడు మంజునాథ్ భార్య పల్లవి విలపిస్తూ చెప్పింది.

Tags

Next Story