PM Modi : దుబాయ్ డిప్యూటీ పీఎంతో మోడీ భేటీ విశేషాలు ఇవే

PM Modi : దుబాయ్ డిప్యూటీ పీఎంతో మోడీ భేటీ విశేషాలు ఇవే
X

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని షేక్ హమాస్ మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూ ఏఈ భారత్ సంబంధాల బలోపేతం గురించి సంభాషించారు. లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించారు. దీర్ఘకాల సంబంధం, పరస్పర అభివృద్ధి

లక్ష్యాల ఆధారంగా సహకారం కొనసాగింపును ఆకాక్షించారు. భారతదేశంతో భాగస్వామ్యం యూఏఈ స్థిరమైన వృద్ధిలో కీలకమని షేక్ హమ్డాన్ పునరుద్ఘాటించారు. పెట్టుబడి, వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, ఆహార భద్రత, అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డిజిటల్ పరివర్తన వంటి వ్యూహాత్మక రంగాలలో మరింత పురోగతి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

రెండు దేశాల అభివృద్ధి అజెండాలలో ప్రముఖంగా కనిపించే ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్షణ వంటి ఇతర రంగాల ప్రాముఖ్యతను కూడా ఆయన గుర్తించారు. యూఏఈ అభివృద్ధికి భారతీయ సమాజం అందించే సహకారాన్ని షేక్ హమ్దన్ హైలైట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ హయాంలో భారతదేశం సాధించిన ఆర్థిక పరివర్తనను హన్దాస్ ప్రశంసించారు. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించ డానికి, కొత్త ఉమ్మడి వ్యాపారాలను సులభతరం చేయడానికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story