Modi : ఈ అవార్డు భారతీయులకు అంకితం: మోదీ

శ్రీలంక తనకు ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’ను 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకే చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు శ్రీలంక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రక్షణ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు MoU కుదుర్చుకున్నారు.
శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి 2.4 బిలియన్ల శ్రీలంక రూపాయలను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ శ్రీలంక పర్యటనలో ప్రెసిడెంట్ అనుర కుమారతో రక్షణ, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. గత ఆర్నెల్లలో శ్రీలంకకు ఇచ్చిన 100 మిలియన్ డాలర్ల రుణాలను గ్రాంట్లుగా మార్చామని మోదీ తెలిపారు. తమిళ జాలరులను విడుదల చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com