Tamilanadu: బైక్ లను ఢీకొన్న టిప్పర్, ఆరుగురు మృతి

Tamilanadu: బైక్ లను ఢీకొన్న టిప్పర్,  ఆరుగురు మృతి
మరో 9 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

తమిళనాడులో ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. చెంగల్‌పట్టులో జరిగిన ఓ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ అతివేగంతో ఉండటంతో డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయాడు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మూడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మంచి స్పీడ్ తో పరుగులు పెడుతున్న ఈ లారీ అదే రోడ్ లో ఉన్న పాదచారులను కూడా ఢీకొట్టింది. తొమ్మిది మంది గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రి సహా చెంగల్పట్టులోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు. సంఘటన ప్రదేశంలో బీభత్సమైన వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి చెన్నె వెళుతోందని సమాచారం.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story