కోల్కతా సీబీఐ టీంలో ఒక్కరు కాదు.. ఇద్దరు లేడీ సింగంలు

X
By - Manikanta |21 Aug 2024 5:00 PM IST
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన విచారించే సీబీఐ బృందంలో ఇద్దరు కీలక మహిళా అధికారులకు అప్పగించారు. హత్రాస్, ఉన్నావో వంటి సంచలనాత్మక కేసుల్లో దర్యాప్తు సాధించిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు.. ఈ కేసు విచారణ చేపట్టనున్నారు.
జార్ఖండ్ కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంపత్ మీనాతోపాటు హక్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా అహుజా కూడా ఈ కేసులో భాగం కానున్నారు. సంపత్ మీనా సీబీఐ అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె 25 మంది అధికారులు బృందానికి బాధ్యత వహిస్తారు.
సంపత్ మీనా 2007 నుంచి పలు కేసుల్లో విచారణ చేపట్టి రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. కాగా, మరో అధికారి సీమా అహుజా కోల్ కతా ఘటనలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com