RBI Annual Report : డిజిటల్ చెల్లింపుల్లో కింగ్ యూపీఐ

డిటిటల్ చెల్లింపుల్లో యూపీఐ రారాజుగా నిలిచింది. గ్లోబల్ రియల్టైమ్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 48.5 శాతంగా ఉందని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపుల సంఖ్యలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ముందుందని ఆర్బీఐ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 41.7 శాతం, విలువ పరంగా 30.3 శాతం పెరిగాయి. నిఫ్ట్ లావాదేవీలు సంఖ్య పరంగా 32.4 శాతం, విలువ పరంగా 13.4 శాతం పెరిగాయి. దేశీయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ టైమ్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతంగా ఉన్నాయి.
యూపీఐని పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) నిర్వహిస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 2025 మార్చి 31 నాటికి ప్రధానంగా టైర్-3, టైర్-4 కేంద్రాల్లో యూపీఐ చెల్లింపులు పెరిగాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్స్ 24.7 శాతం పెరిగి 1.1 కోట్లకు చేరుకున్నాయి. యూపీఐ క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్స్ 91.5 శాతం పెరిగి 65.8 కోట్లకు చేరాయి. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్)తో ఆర్బీఐ సంయుక్తంగా 2024-25 నుంచి 2028-29 నాటికి 20 దేశాల్లో యూపీఐ చెల్లింపులను తీసుకు రావాలని నిర్ణయించినట్లు నివేదిక తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com