UPI Transactions : 33 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు

దేశంలో మే నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 33 శాతం పెరిగి 18.68 బిలియన్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో ఇవి 17.89 బిలియన్లుగా ఉన్నాయి. ఈ వివరా లను ఆదివారం నాడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసింది. మేలో యూపీఐ లావాదేవీల విలువ 25.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్లో నమోదైన 23.95 లక్షల కోట్లతో పోల్చితే మేలో 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం మే నెలతో పోల్చుకుంటే మాత్రం లావాదేవీల విలువ 23 శాతం పెరిగాయి. సగటున రోజువారి లావాదేవీల సంఖ్య 602 మిలియన్లు, విలువ 81,106 కోట్లుగా ఉన్నాయి. మే నెలలో ప్రత్యేకంగా 12వ తేదీన యూపీఐ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఫోన్పేలో టెక్నికల్ సమస్యతో లావాదేవీల విలువ తగ్గింది. భవిష్యత్లో ఇలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుం టున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com