G20 Summit : భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక నిర్ణయం?

G20 Summit : భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక నిర్ణయం?
వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడే ఒప్పందాలు..

పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా, భారత్ పావులు కదుపుతున్నాయి. జీ20 సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. రైల్, ఓడరేవుల మెగా డీల్‌పై అమెరికా, సౌదీ అరేబియా, భారత్, ఇతర దేశాలు చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ శుక్రవారం ప్రకటించింది.

దీనిపై అమెరికన్ న్యూస్ లెటర్ ఆక్సియోస్ కథనాన్ని నివేదించింది. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ మధ్య 2024కి ముందే సాధారణీకరణ ఒప్పందాన్ని పూర్తి చేయాలని బైడెన్ అడ్మినిస్టేషన్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా లెవాంట్, గల్ఫ్ లోని ఇతర అరబ్ దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ లోని ఓడరేవుల ద్వారా భారతదేశాన్ని కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించనున్నారు.


భారత్, ఇజ్రాయిల్, అమెరికా,యూఏఈ సభ్యదేశాలుగా ఉన్న I2U2 సమావేశంలో ఈ ప్రాజెక్టు ఆలోచన వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో మౌళిక సదుపాయాల గురించి చర్చించడానికి, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుదలకు ధీటుగా I2U2 ఫోరమ్ 2021లో ఏర్పాటైంది. ఈ ప్రాంతాలను రైల్వే ద్వారా అనుసంధానించాలనే ఆలోచనను ముందుగా ఇజ్రాయిల్ లేవనెత్తింది. ఈ ప్రాజెక్టులో భారత నైపుణ్యాన్ని ఉపయోగించాలని ఈ ఆలోచన చేసింది. ఈ దేశాలతో పాటు ఇందులో సౌదీ అరేబియా భాగస్వామ్యాన్ని బైడెన్ అడ్మినిస్టేషన్ విస్తరించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ విజన్ ను అడ్డుకునేందుకు ఈ దేశాలు ఈ మెజా ప్రాజెక్టుపై ఆలోచన చేస్తున్నాయి.

ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ (I2U2) వేదికలో గత 18 నెలల నుంచి జరుగుతున్న చర్చల్లో ఈ ఒప్పందాలకు ఓ రూపం వచ్చినట్లు తెలుస్తోంది. భారత దేశానికి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, ఈ ప్రాంతాన్ని రైల్వేల ద్వారా అనుసంధానం చేయాలనే ప్రతిపాదన చేసిన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. బైడెన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో కూడా చర్చించే అవకాశం ఉంది. మధ్య ప్రాచ్య దేశాల్లో చైనా ప్రభావం పెరుగుతుండటంతో, చైనాకు చెక్ పేట్టేందుకు అమెరికా ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై వైట్‌హౌజ్ ప్రతినిధి జెక్ సుల్లివన్ మాట్లాడుతూ.. దీనిపై ప్రస్తుతం తానూ ఏం ధృవీకరించలేదనని.. మేము మా భాగస్వామ్య సభ్యదేశాలతో కలిసి కృషి చేస్తామన్నారు. .

Tags

Read MoreRead Less
Next Story