Uttarakhand Accident: నదిలోకి దూసుకెళ్లిన కారు..9 మంది మృతి..!
By - Divya Reddy |8 July 2022 5:50 AM GMT
Uttarakhand Accident: ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు.
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులందరూ పంజాబ్కు చెందిన వారుగా గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న డిమాండ్లు వచ్చాయి. అంతలోనే ఇక్కడ మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com