Uttarakhand Accident: నదిలోకి దూసుకెళ్లిన కారు..9 మంది మృతి..!

Uttarakhand Accident: నదిలోకి దూసుకెళ్లిన కారు..9 మంది మృతి..!
Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులందరూ పంజాబ్‎కు చెందిన వారుగా గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న డిమాండ్లు వచ్చాయి. అంతలోనే ఇక్కడ మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story