IND vs AUS: స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయం ?

ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. కోహ్లీ కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. మోకాలికి బ్యాండేజీ వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో విరాట్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కింగ్ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లోవిఫలమైన కోహ్లీ.. పెర్త్లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫామ్లోకి వచ్చిన విరాట్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరింతగా సత్తాచాటాలని చూశాడు. అయితే డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో మొదలయ్యే రెండో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అనంతరం మోకాలికి బ్యాండేజీతో మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం విరాట్ బాగానే నడుస్తున్నా.. అడిలైడ్లో జరిగే డే/నైట్ టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.
పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసి కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మరోవైపు.. రెండో టెస్టులో కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com