PM Modi : పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : మోదీ

పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను బీహార్ పర్యటనకు వచ్చి నప్పుడు చెప్పానని, దానిని నిలబెట్టుకున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హామీ నెరవేర్చిన తర్వాతే బీహార్ వచ్చినట్టు తెలిపారు. ఉగ్రవాదులను ఊహించని విధంగా శిక్షిస్తానని చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఇవాళ కరకట్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతానని అన్నారు. ఇదే సరికొత్త భారత్ విధానమని అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే తాను బిహార్ పర్యటనకు వచ్చానన్నారు. పాక్ లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చిన నేరవేర్చానని చెప్పారు. పాకిస్థాన్ మన మహిళల సిందూరం శక్తిని చవిచూసిందని చెప్పారు. పాక్ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారని, మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టామని పీఎం చెప్పారు. మనం వారి ఎయిర్ బేస్లను, మిలిటరీ స్థావరా లను నిమిషాల్లోనే ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ మన అమ్ములపొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్ తెలుసుకోవాలన్నారు. ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదని, మరోసారి ఉగ్రదాడి జరిగితే.. ఆ పాము తలే ధ్వంసమవుతుందని ప్రధాని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com