Anil Chauhan : నష్టాన్ని కాదు.. విజయాన్ని చూడాలి : అనిల్ చౌహాన్

యుద్ధం అన్నప్పుడు చిన్న చిన్న నష్టాలు జరుగుతాయని, వాటికన్నా ఏం సాధించామన్నది ముఖ్యమని, నష్టాన్ని కాదు, సాధించిన విజయాన్ని చూడాలని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఆపేయాలని అన్నారు. పుణేలో డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో ఏర్పాటైన ఓ కార్యక్రమానికి అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ను ఆయన ప్రస్తావించారు. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో భారత ఆర్మీకి చెందిన కొన్ని ఎష్టాబ్లిష్మెంట్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ కు ముందుగానే సమాచారం ఇచ్చామని అనిల్ చౌహాన్ చెప్పారు. ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని ముందుగానే చెప్పి మరీ దెబ్బకొట్టామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించనున్నట్లు మే 7వ తేదీ నాడే ఆ దేశానికి తెలియజేశామని స్పష్టం చేశారు. మే 10వ తేదీన అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు దాడులు ఆరంభం అయ్యాయని, 48 గంటల్లో భారత్ ను మోకరిల్లేలా చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ తొలుత ఈ దాడులను చేపట్టిందని వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘించడం.. వంటి కవ్వింపు, రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్ తో యుద్ధ తీవ్రతను పెంచడానికి కారణమైందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com