Delhi CM : ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు..? ఆమెకే గోల్డెన్ ఛాన్స్

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా .. కేజ్రీవాల్ తో కీలక చర్చలు చేస్తున్నారు. ప్రభుత్వ సారథిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా ప్రకటన చేసిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై చర్చిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో మంత్రి అతిశీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేజ్రివాల్ జైల్లో ఉన్న సమయంలో ఆమె పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్చార్జ్ వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు.
అతిశీతో పాటు సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్ పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక మనీశ్ సిసోడియా.. కేజ్రివాల్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తే మాత్రమే తాను కూడా మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com