New Delhi : నవంబర్ 25 నుంచి శీతాకాల సమావేశాలు

New Delhi : నవంబర్ 25 నుంచి శీతాకాల సమావేశాలు
X

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం వెల్లడించారు. ఈ సెషన్‌లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సంవిధాన్‌ సదన్‌ (పార్లమెంట్‌ పాత భవనం) సెంట్రల్‌ హాల్‌ ఇందుకు వేదికకానుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతే ఈ సెషన్ ప్రారంభంకానుంది. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్‌ బిల్లును ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. గత సెషన్‌లోనే కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే విపక్షాలు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో కేంద్రం ఒక్క అడుగు వెనక్కివేసి..దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది.

Tags

Next Story