Mumbai : వామ్మో.. ముంబైలో రెండు డూప్లెక్స్ల ధర రూ.639 కోట్లు

ముంబైలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో రికార్డ్ సృష్టించింది. వర్లిలో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో రెండు డ్యూప్లెక్స్ ప్లాట్స్ 639 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఇదే అత్యంత ఖరీదైన డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ ధరగా నిలిచింది. 40 అంతస్తుల భవనంలో ఇవి ఉన్నాయి. ఫార్మా కంపెనీ చైర్మన్ గా ఉన్న లీనా గాంధీ తివారీ 32 నుంచి 35 అంతస్తుల్లో ఉన్న రెండు అల్ట్రా లగ్జరీ యూనిట్లను చదరపు అడుగుకు 2.83 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. తివారీ ఈ కొనుగోలుకు 63.9 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ, జీఎస్టి కోసం చెల్లించారు. ఈ మొత్తాన్ని కూడా కలిపితే అపార్టుమెంట్ ధర రూ.703 కోట్లుగా అవుతుంది. సౌత్ సెంట్రల్ ముంబైలో ఉన్న వర్లి లగ్జరీ రెసిడెన్షియల్ కేంద్రంగా ఉంది. అరేబియా సముద్రాన్ని చూడటంతో పాటు, బాంద్రా, నారిమన్ పాయింట్ఎల్ఎ ఇది సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతం ముంబైలోని అపర కుబేరులకు ఇష్టమైన ప్రాంతంగా ఉంది. దీంతో ప్లాట్స్ రేట్లు భారీగా ఉన్నాయి. గత వారంలోనే వర్లిలోనే ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ 400 కోట్ల రూపాయలకు సముద్ర తీరంలో ఉన్న భవనాన్ని కొనుగోలు చేశారు. ఆయన చదరపు అడుగును 2.90 లక్షలకు కొనుగోలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com