YOGI: భవిష్యత్త్ భారత రథసారధి యోగీ!

YOGI: భవిష్యత్త్ భారత రథసారధి యోగీ!
X
ఉత్తర్​ప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం

ఉత్తర్​ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరో ప్రభంజనం. దేశ వ్యతిరేక శక్తులపై ఆయన తీసుకునే కఠిన చర్యలు ఓ సంచలనం. ఆ ఉక్కు మనిషి ప్రశంసలకు పరవశులైపోరు. కఠిన నిర్ణయాలకు వెనుకాడరు. కష్టనష్టాలకు బెదరరు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వెను తిరిగి చూడరు. విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరకుదనాన్ని ప్రదర్శించి.... తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో చేరేందుకు 21 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్న వేళ.. భారత భవిష్యత్త్ రథసారధిగా యోగి ఆదిత్యనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది.

మోదీ స్థా­నా­న్ని సమ­ర్థం­గా భర్తీ చే­య­గల సా­మ­ర్థ్యం యో­గీ­కే ఉన్నా­య­ని ఆర్ఎ­స్ఎ­స్ కూడా భా­వి­స్తోం­ది. దేశం కోసం ఎం­త­టి త్యా­గా­ని­కై­నా... ఎం­త­టి కఠిన ని­ర్ణ­యా­ని­కై­నా వె­న­కా­డ­బో­ర­న్న­ది దే­శా­ని­కి తె­లి­సిన సత్యం. మరి యోగీ ని­జం­గా­నే దేశ ప్ర­ధా­ని­గా బా­ధ్య­త­లు చే­ప­డ­తా­రా అంటే బీ­జే­పీ శ్రే­ణుల నుం­చి ఆర్ఎ­స్ఎ­స్ వరకు అవు­న­నే సమా­ధా­న­మే వి­ని­పి­స్తోం­ది. ఇటీ­వల శి­వ­సేన కీలక నేత, ఎంపీ సం­జ­య్ రౌత్ చే­సిన వ్యా­ఖ్య­లే మోదీ రి­టై­ర్ మెం­ట్ పై అనేక అను­మా­నా­ల­ను.. ప్ర­శ్న­ల­ను లే­వ­నె­త్తా­యి. ప్ర­ధా­ని మోదీ సె­ప్లెం­బ­ర్‌­లో రి­టై­ర్డ్ అవ్వా­ల­ను­కుం­టు­న్నా­ర­ని... అం­దు­కే ఆయన సడె­న్‌­గా ఆర్ఎ­స్ఎ­స్ కా­ర్యా­ల­యా­న్ని సం­ద­ర్శిం­చా­ర­ని సం­జ­య్ రౌత్ వ్యా­ఖ్యా­నిం­చా­రు. ప్ర­ధా­ని మోడీ వా­ర­సు­డి­ని త్వ­ర­లో­నే ఆర్ఎ­స్ఎ­స్ ని­ర్ణ­యి­స్తోం­ద­ని కూడా అన్నా­రు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్త చర్చ ఆరంభమైంది. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నేతల్లో 74ఏళ్లు దాటిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నిబంధన ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74వ ఏట ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టిన రోజు. ఈ నెలలోపు ఆర్ఎస్ఎస్ మోదీతో ప్రధాని పదవికి రాజీనామా చేయిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమాయానికి ఆయనకు 74ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది.

యోగీకే దక్కుతుందా..?

ఓవైపు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతల ఎదుగుదల.. మరోవైపు ప్రధాని మోదీకి వయసు పెరుగుదల వంటి కారణాలతో ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు రథసారధిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ కారణాలతో ఇప్పుడిప్పుడే మోదీని పక్కన బెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ ఆయన తర్వాత ప్రధాని ఎవరనే దాని కోసం అన్వేషణ, నేతలను తయారు చేయడం వంటివాటిపై ఆర్ఎస్ఎస్ లో ఇప్పటికే చర్చ­లు సా­గు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ప్ర­ధా­ని పద­వి­కి యోగీ అది­త్య­నా­థ్- అమి­త్ షా మధ్య పోటీ నె­ల­కొం­ద­ని పలు­వు­రు రా­జ­కీయ ని­పు­ణు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. ప్ర­ధా­ని పదవి పోటీ నుం­చి యో­గి­ని తప్పిం­చేం­దు­కు అమి­త్ షా ప్ర­య­త్ని­స్తు­న్నా­ర­ని.. కానీ ఆయ­న­కు సరైన అవ­కా­శం దొ­ర­క­డం లే­ద­ని... అమి­త్ షాకు అధి­కా­రా­లు ఉండి ఉం­డొ­చ్చు కానీ, ప్ర­జల దృ­ష్టి­లో ఆయన అంత గొ­ప్ప­గా ఏమీ లే­ర­ని అల­హా­బా­ద్ యూ­ని­వ­ర్సి­టీ పొ­లి­టి­క­ల్ సై­న్స్ ప్రొ­ఫె­స­ర్ పం­క­జ్ కు­మా­ర్ అం­చ­నా వే­శా­రు. బీ­జే­పీ­ని ఇష్ట­ప­డే ఓట­ర్ల­లో మోదీ తర్వాత యోగి రెం­డో­స్థా­నం­లో ఉన్నా­ర­ని.. యూ­పీ­లో­నే కా­కుం­డా ఇతర రా­ష్ట్రా­ల్లో­నూ అమి­త్ షా కంటే యో­గి­కే ఆదరణ ఎక్కు­వ­ని మరో రా­జ­కీయ ని­పు­ణు­డు అం­చ­నా వే­శా­రు. అయి­తే తదు­ప­రి ప్ర­ధా­ని­గా ఎవ­రి­ని ఎను­కు­న్నా అది సంఘ్ మద్ద­తు, మా­ర్గ­ద­ర్శ­కా­లు, పర­స్పర చర్చల ద్వా­రా­నే ఉం­టుం­ద­న్న­ది మా­త్రం సు­స్ప­ష్టం.

Tags

Next Story