ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 292కి చేరిన మృతులు - Live Updates

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 292కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. నిన్న రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు.... ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్పై పడిన ‘కోరమాండల్’ బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ముందుగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్పై వస్తోన్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్ రైలు ‘కోరమాండల్’ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఈ మేరకు రైల్వే అధికారులు.. అధికారిక ప్రకటన చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్ఖితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్........ షాలిమార్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్స్లను పంపారు. దాదాపు వందకుపైగా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాయి. బాలాసోర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. అలాగే, బాలేశ్వర్లోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ప్రకటించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చనిపోయినవారికి 10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి 50వేలు చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ అక్కడికి వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం మృతుల కుటుంబాలకు తరుపున 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com