తూర్పుగోదావరిలో ఘోర రోడ్డుప్రమాదం

X
By - Bhoopathi |12 Jun 2023 10:45 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల చిన్నారి ఉంది. కారు లారీ కింద పడి నుజ్జునుజ్జు అయింది. హైదరాబాద్లో పెళ్లికి వెళ్లి తిరిగి విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మిద్దె సత్తిబాబు, మిద్దె రవితేజ, అరుణ, శ్రావణి, 8 నెలల చిన్నారి ఉన్నారు. మృతి చెందిన మరో మహిళ పేరు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com