ASIA CUP: ఆసియా కప్‌ సమరానికి భారత్ సిద్ధం

ASIA CUP: ఆసియా కప్‌ సమరానికి భారత్ సిద్ధం
X
ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా... సన్నహాలు ప్రారంభించిన సూర్య సేన... యూఏఈతో సెప్టెంబర్ 10న భారత్ మ్యాచ్‌

క్రి­కె­ట్‌ అభి­మా­ను­లు ఎప్పు­డె­ప్పు­డా అని ఎదు­రు చూ­స్తు­న్న ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­కి రంగం సి­ద్ద­మైం­ది. మరో నా­లు­గు రో­జు­ల్లో ఈ టో­ర్నీ­కి తె­ర­లే­వ­నుం­ది. సె­ప్టెం­బ­ర్ 9న యూఏఈ వే­ది­క­గా టీ20 ఫా­ర్మా­ట్‌­లో ప్రా­రం­భం కా­నుం­ది. ఆతి­థ్య యూ­ఏ­ఈ­తో పాటు భా­ర­త్, పా­కి­స్థా­న్, ఒమన్, శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్, హాం­గ్ కాం­గ్, అఫ్గా­ని­స్థా­న్ జట్లు ఈ టో­ర్నీ­లో తల­ప­డు­తు­న్నా­యి. ఈ 8 జట్ల­ను రెం­డు గ్రూ­ప్‌­లు­గా వి­భ­జిం­చా­రు. యూఏఈ, పా­కి­స్థా­న్, ఒమ­న్‌­తో కలి­సి భా­ర­త్ గ్రూ­ప్-ఏలో ఉంది. లీగ్ దశలో ప్ర­తీ జట్టు ఒక్కో మ్యా­చ్ ఆడ­నుం­ది. టాప్-2లో ని­లి­చిన జట్లు సూ­ప­ర్-4కు అర్హత సా­ధి­స్తా­యి. నా­లు­గు జట్లు మరో­సా­రి ఒక్కో­సా­రి తల­ప­డు­తా­యి. టాప్-2లో ని­లి­చిన జట్లు ఫై­న­ల్ చే­రు­తా­యి. ఇప్ప­టి­కే తమ జట్ల­ను ప్ర­క­టిం­చిన ఆయా దే­శా­లు సన్నా­హ­కా­లు కూడా ప్రా­రం­భిం­చా­యి. యూఏఈ, అఫ్గా­ని­స్థా­న్, పా­కి­స్థా­న్‌ జట్లు సన్నా­హ­కం­గా ట్రై సి­రీ­స్ ఆడు­తు­న్నా­యి. ఇం­గ్లం­డ్ పర్య­టన అనం­త­రం వి­శ్రాం­తి­లో ఉన్న భారత జట్టు మా­త్రం ఇంకా సన్నా­హ­కా­లు మొ­ద­లు­పె­ట్ట­లే­దు.

చేరుకున్న టీమిండియా

ఇప్ప­టి­కే టీ­మ్‌­ఇం­డి­యా ప్లే­య­ర్లు దు­బా­య్‌­లో అడు­గు­పె­ట్టే­శా­రు. ఈసా­రి పొ­ట్టి ఫా­ర్మా­ట్‌ మ్యా­చు­లు కా­వ­డం­తో సర్వ­త్రా ఆస­క్తి నె­ల­కొం­ది. మరో రెం­డు రో­జు­ల్లో టీ­మిం­డి­యా యూ­ఏ­ఈ­కి చే­ర­నుం­ది. తొలి మ్యా­చ్‌­ను యూ­ఏ­ఈ­తో సె­ప్టెం­బ­ర్ 10న ఆడ­ను­న్న భా­ర­త్.. సె­ప్టెం­బ­ర్ 14న దా­యా­దీ పా­కి­స్థా­న్‌­తో తల­ప­డ­నుం­ది. సె­ప్టెం­బ­ర్ 19న ఒమ­న్‌­తో చి­వ­రి లీగ్ మ్యా­చ్ ఆడ­నుం­ది. పా­కి­స్థా­న్, భా­ర­త్ మె­రు­గైన ప్ర­ద­ర్శన చేసి ఫై­న­ల్ చే­రి­తే మూడు సా­ర్లు తల­ప­డు­తా­యి. ఇరు దే­శాల మధ్య ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో భా­ర­త్, పాక్ పో­రు­పై సర్వ­త్రా ఆస­క్తి నె­ల­కొం­ది. భారత్ వర్సెస్ యూఏఈ మధ్య రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధం

భారత జట్టు సె­ప్టెం­బ­ర్ 9 నుం­చి యూ­ఏ­ఈ­తో ప్రా­రం­భ­మ­య్యే టీ20 ఆసి­యా కప్‌­లో సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ నా­య­క­త్వం­లో పా­ల్గొం­టుం­ది. టీ­మిం­డి­యా ఆట­గా­ళ్లం­ద­రూ సె­ప్టెం­బ­ర్ 4 నా­టి­కి దు­బా­య్ చే­రు­కో­వా­ల­ని బీ­సీ­సీఐ నుం­చి ఆదే­శా­లు అం­దా­యి. జట్టు తొలి శి­క్ష­ణా సె­ష­న్ ఈరో­జు, సె­ప్టెం­బ­ర్ 5 నుం­చి ఐసీ­సీ అకా­డ­మీ­లో జరు­గు­తుం­ది. ఆసి­యా కప్ 2025లో భారత జట్టు పూల్ ఏలో ఉంది. ఇం­దు­లో యూఏఈ, ఒమన్, పా­కి­స్తా­న్ జట్లు కూడా ఉన్నా­యి. సె­ప్టెం­బ­ర్ 10 న జరి­గే యూఏఈ జట్టు­తో భారత జట్టు టో­ర్న­మెం­ట్‌­లో తన మొ­ద­టి మ్యా­చ్ ఆడా­లి. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ నా­య­క­త్వం వహిం­చ­ను­న్న ఆసి­యా కప్ భా­ర­త­దే­శా­ని­కి చాలా ము­ఖ్య­మై­న­ది. వచ్చే ఏడా­ది జర­గ­ను­న్న టీ20 ప్ర­పంచ కప్ కోసం సన్నా­హా­లు దృ­ష్టి­లో ఉం­చు­కు­ని దీ­ని­ని ప్రా­ధా­న్యత పె­రి­గిం­ది. భారత జట్టు సె­ప్టెం­బ­ర్ 10న దు­బా­య్ స్టే­డి­యం­లో UAE­తో ఆడటం ద్వా­రా తన ప్ర­చా­రా­న్ని ప్రా­రం­భిం­చ­నుం­ది. ఈ వే­ది­క­పై భారత జట్టు రి­కా­ర్డు దా­దా­పు టీ20 అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­ల­కు సమా­నం, ఇప్ప­టి­వ­ర­కు ఇక్కడ 9 మ్యా­చ్‌­లు ఆడిం­ది. వీ­టి­లో టీం ఇం­డి­యా 5 మ్యా­చ్‌­లు గె­లి­చి 4 మ్యా­చ్‌­ల్లో ఓడి­పో­యిం­ది. అయితే ఈ టోర్నీలో గెలిచే జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్‌మనీని లభించనుంది. రన్నరప్ జట్టుకు రూ. 1.3 కోట్లు దక్కనుంది. 2022లో చివరిసారిగా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగ్గా.. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీలంకకు రూ. 1.6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది.

Tags

Next Story