CWC2023: మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధం

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో మ్యాచ్కు సిద్దమైంది. లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో రోహిత్ సేన తలపడనుంది. వరుస ఓటములతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లాండ్పై విజయం సాధించి సెమీఫైనల్కు మరింత చేరువ కావాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన బ్రిటీష్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. రోహిత్ సేన ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటివరకూ అప్రతిహాత జైత్రయాత్రతో ముందుకు సాగిపోతున్న టీమిండియా.. అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. ఈ ప్రపంచకప్లో విజయం సాధించి సెమీస్కు ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. బ్రిటీష్ జట్టుపై గెలిచి వరల్డ్కప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మళ్లీ కైవలం చేసుకోవాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచ్లోనూ పరాజయం పాలైతే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే.
లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో హార్దిక్ స్థానంలో అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అశ్విన్ తుది జట్టులోకి వస్తే సిరాజ్, షమిల్లో ఒకరికే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. షమీ గత మ్యాచ్లో అదరగొట్టాడు. హార్దిక్ ఉంటే మిడిలార్డర్ బ్యాటింగ్లో ఉపయోగపడడమే కాక.. మూడో పేసర్ పాత్ర పోషించేవాడు. ఒకవేళ అశ్విన్ను ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకుంటే సూర్యపై వేటు వేసి ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగవచ్చు. ప్రపంచకప్లో వరుస పరాజయాలతో బలహీనంగా కనిపిస్తున్నంత మాత్రాన ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున బ్రిటీష్ జట్టు ఎంత విధ్వంసం సృష్టించగలదో అందరికీ తెలుసు.
బ్యాటింగ్, బౌలింగ్ల్లో టీమిండియా పటిష్టంగా ఉంది. కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉండగా... శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. రోహిత్, కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజాల్లో ఒక్కరు నిలబడ్డా ఇంగ్లండ్పై గెలుపు పెద్ద కష్టం కాదు. వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగానే ఉంది. జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్ తమదైన రోజున ఎంత విధ్వంసం సృష్టిస్తారో క్రికెట్ ప్రేమికులకు తెలుసు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com