IND vs NZ: భారత్తో మూడు టెస్టుల సిరీస్.. న్యూజిలాండ్కు భారీ షాక్

మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 16) నుండి జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయం కారణంగా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ భారత్తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు.
న్యూజిలాండ్-శ్రీలంక పర్యటనలో బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను భారతదేశానికి తిరిగి రావడం ఆలస్యమైంది. అతనికి మోకాలి గాయం ఉందని, కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నాడని స్కానింగ్లో వెల్లడైంది. న్యూజిలాండ్ క్రికెట్ తన అధికారిక ప్రకటనలో బెన్ సియర్స్ గురించి సమాచారం ఇచ్చింది. “వైద్యుల సలహా తర్వాత, అతను ఈ టెస్ట్ సిరీస్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాము” అని పేర్కొంది. అతని స్థానంలో జాకబ్ డఫీని తీసుకున్నామని.. అలాగే, సియర్స్కు చికిత్స, పునరావాసం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.
న్యూజిలాండ్ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. “బెన్ సియర్స్ గాయం మాకు నిరాశ కలిగించింది. అతను తన టెస్ట్ కెరీర్కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. అతను మాకు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఎంపిక. అయితే, అతను ఎంతకాలం ఆడకుండ ఉంటాడో ఖచ్చితంగా చెప్పలేము. అతను వీలైనంత త్వరగా కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. మరోవైపు.. ఇది జాకబ్ డఫీకి ఒక పెద్ద అవకాశం.” అని అన్నాడు. జాకబ్ డఫీ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరపున ఆరు వన్డేలు, 14 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. కానీ ఇంకా తన టెస్ట్ అరంగేట్రం చేయలేదు. అతను 102 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల అనుభవం కలిగి ఉన్నాడు. రెడ్ బాల్తో 299 వికెట్లు తీసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com