WWC 2025: మన అమ్మాయిలు... విశ్వ విజేతలు

WWC 2025: మన అమ్మాయిలు... విశ్వ విజేతలు
X
ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు.. జగజ్జేతలుగా నిలిచిన టీమిండియా మహిళలు

మన అమ్మా­యి­లు సా­ధిం­చా­రు. దశా­బ్దా­లు­గా అం­ద­ని కలలా ఊరి­స్తు­న్న ప్ర­పం­చ­క­ప్‌­ను ఒడి­సి­ప­ట్టి జగ­జ్జే­త­లు­గా ని­లి­చా­రు. రెం­డు­సా­ర్లు అం­ద­‌­కుం­డా పో­యిన వ‌­న్డే ప్ర­పం­చ­‌­క­‌­ప్ టో­ర్నీ­ని ము­చ్చ­ట­‌­గా మూ­డో­సా­రి ఒడి­సి ప‌­ట్టా­రు. సొం­త­‌­గ­‌­డ్డ­పై తొ­లి­సా­రి­గా ప్ర­పంచ చాం­పి­య­‌­న్లు­గా ని­లి­చా­రు. వం­ద­కో­ట్ల మంది కన్న కలను.. పది­హే­ను మంది ప్లే­య­ర్లు సా­కా­రం చే­శా­రు. ప్ర­తి ఇల్లు, వీధి, నగరం, రా­ష్ట్రం.. తే­డా­లే­కుం­డా ప్ర­జ­లం­తా తమ కల నె­ర­వే­రి­నం­దు­కు సం­బ­రా­ల్లో ము­ని­గి­పో­యా­రు. తర­త­రాల ని­రీ­క్ష­ణ­కు తె­ర­ప­డిన ఈ క్ష­ణా­న్ని దేశం ఎన్న­టి­కీ మరు­వ­దు. 1983లో కపి­ల్ డె­వి­ల్స్ సా­ధిం­చిన వి­జ­యం తర్వాత.. 2025లో కౌర్ సేన గె­లు­పు.. దే­శం­లో క్రి­కె­ట్ రూ­పు­రే­ఖ­లు మా­ర్చిం­ద­ని చరి­త్ర చె­ప్పు­కో­వ­డం ఖాయం. ఆ చరి­త్ర­లో ని­లి­చి­పో­యే ప్ర­ద­ర్శన చే­సిన ఈ అమ్మా­యిల జట్టు­ను కూడా దేశం మరు­వ­దు.. మరు­వ­లే­దు. ఎం­త­గొ­ప్ప­గా ఆడు­తు­న్నా, అద్భు­త­మైన ఫా­మ్‌­లో ఉన్నా.. ఒక్క ఐసీ­సీ ట్రో­ఫీ లే­క­పో­వ­డం ఈ టీం­కు ఇం­త­కా­లం మన­సు­ను మె­లి­పె­ట్టే వె­లి­తి. ఆ బాధ తీ­రిన రోజు ఇది. ఐసీ­సీ టో­ర్నీ­ల్లో వై­ఫ­ల్యా­లు చూసి చో­క­ర్స్ అనే ము­ద్ర­ను చె­రి­పే­సి తాము చో­క­ర్స్ కాదు వి­న్న­ర్స్ అని టీ­మిం­డి­యా చాటి చె­ప్పిం­ది. ఆట ఏదై­నా ప్ర­పం­చ­క­ప్‌ అంటే.. ఆడే ప్ర­తి ఒక్క­రూ నె­ర­వే­ర్చు­కో­వా­ల­ను­కు­నే స్వ­ప్నం. దశా­బ్దా­లు­గా ఆ కలను కం­టూ­నే ఉంది. 1978 నుం­చి భారత జట్టు ప్ర­య­త్ని­స్తూ­నే ఉంది. కానీ ప్ర­తి­సా­రీ ని­రా­శే. ఈసా­రి మా­త్రం ఆ ఆశ నె­ర­వే­రిం­ది.

అద్భుత పోరాటంతో...

టా­స్‌ చే­జా­రి బ్యా­టిం­గ్‌ చే­యా­ల్సి వచ్చి­నా.. తొలి వి­కె­ట్‌­కు శతక భా­గ­స్వా­మ్యం.. 27 ఓవ­ర్ల­కు స్కో­రు 162/1.. ఆ ఊపు చూ­స్తే 350 కొ­ట్టే­య­బో­తు­న్నాం, కానీ చి­వ­రి­కి చూ­స్తే లక్ష్యం 299 పరు­గు­లే. సె­మీ­ఫై­న­ల్లో మన జట్టు ఛే­దిం­చిన స్కో­రు కంటే ఇది 40 తక్కు­వే. ఈ స్కో­రు­ను కా­పా­డు­కో­గ­ల­రా అన్న అను­మా­నం! కె­ప్టె­న్‌ ముం­దుం­డి నడి­పిం­చ­గా సఫా­రీ జట్టు 39 ఓవ­ర్ల­కు 207/5తో ని­లి­చిన సమ­యాన లో­లోన గు­బు­లు! కానీ సె­మీ­స్‌­లో ఆస్ట్రే­లి­యా­పై సా­ధిం­చిన వి­జ­యం గా­లి­వా­టం కా­ద­ని చా­టు­తూ.. తమది సి­స­లైన ఛాం­పి­య­న్‌ జట్ట­ని రు­జు­వు చే­స్తూ.. హర్మ­న్‌­ప్రీ­త్‌ సేన ఒక్క­సా­రి­గా జూలు వి­ది­ల్చిం­ది. పద­కొం­డు మందీ ప్రా­ణం పె­ట్టి ఆడగా.. జట్టం­తా చేయి చేయి కలి­పి సమ­ష్టి­గా కద­ల­గా.. కలల కప్పు­ను ఒడి­సి­ప­ట్టిం­ది.

తెలుగు అమ్మాయిలు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లున్నారు. వీరే శ్రీచరణి, అరుంధతి రెడ్డి. వీరిలో శ్రీచరణి.. టోర్నీ ఆసాంతం అద్భుతమైన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నది. వరల్డ్ కప్‌లో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. అరుంధతికి మాత్రం ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. టోర్నీ ఆసాంతం బెంచ్‌కే పరిమితమైంది.

Tags

Next Story