MS Dhoni : నన్ను బాధపెట్టింది అదే.. ధోనీ మనసులో మాట

MS Dhoni : నన్ను బాధపెట్టింది అదే.. ధోనీ మనసులో మాట
X

ఓ ఇంటర్వ్యూలో గత ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు క్రికెట్ లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనీ ( Mahendra Singh Dhoni ). 2019 ప్రపంచ కప్ ఓటమి నుంచి బయట పడేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. "నాకు అదే చివరి వరల్డ్ కప్ అని తెలుసు. విజ యం సాధించిఉంటే చాలా బాగుండేది. నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం అదే. ఫలితం ఎలా వచ్చినా మనం తీసుకోవాలి. ముందుకుసాగిపోవాలి. కానీ, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఓటమిని తీసుకోవడానికి కాస్త సమయం పట్టిందనే చెబుతా. ఆ తర్వాత అంత ర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు నాకు చాలా సమయం ఉంది. తప్పకుండా మనసును బాధపెట్టిన క్షణం మాత్రం అదే. విజయం కోసం తీవ్రంగా శ్రమించాం. కానీ గెలవలేకపోయాం" అని ధోనీ వ్యాఖ్యానించాడు.

2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజీలాండ్ పై భారత్ తృటిలో గెలుపును చేజార్చుకుంది. "ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో నాకు ఇష్టమైన పేర్ల గురించి చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా బ్యాటర్ల విషయంలో చెప్పలేను. చాలామంది విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలో ఎవరని అడుగుతుంటారు. వీరే కాకుండా మరికొందరు అద్భుత బ్యాటర్లు ఉన్నారు. అలాగని అత్యుత్తమ బౌలర్లు లేరని కాదు. బ్యాటర్ల విషయం పక్కన పెడితే.. బౌలింగ్లో మాత్రం మరో ఛాన్స్ లేదు. అది బుమ్రానే" అని ధోనీ వెల్లడించాడు.

ప్రస్తుతం ఐపీఎల్లోనే అభిమానులను అలరిస్తున్న ధోనీ.. వచ్చే ఏడాది సీజన్లో ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీ ఇటీవల ముగిసిన సీజన్ సమయంలో కెప్టెన్సీకి గుడ్ పై చెప్పారు.

Tags

Next Story