Hardik Pandya : భువీ, బుమ్రాలను దాటేసిన హార్దిక్ పాండ్యా

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను హార్దిక్ పాండ్యా దాటేశాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మొదటి మ్యాచ్లో పాండ్యా 2 వికెట్లు తీశాడు. దీంతో టీ20ల్లో అతని మొత్తం వికెట్ల సంఖ్య 91కి చేరింది. ఈ క్రమంలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలోని భువనేశ్వర్ (90), బుమ్రా (89) లను అతను అధిగమించాడు. ఈ జాబితాలో అర్ష్దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో యుజ్వేంద్ర చాహల్ (96) ఉంటే.. 91 వికెట్లతో పాండ్యా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు, ఐదో స్థానంలో భువనేశ్వర్ (90), బుమ్రా (89) ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com