ICC Penalizes Rishabh Pant : పంత్ కు ఐసీసీ షాక్

ICC Penalizes Rishabh Pant : పంత్ కు ఐసీసీ షాక్
X

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంతు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ అతడికి ఓ డీ మెరిట్ పాయింట్ విధించింది. ప్రవర్తనా నియమావ ళిలోని ఆర్టికల్ 2.8ని పంత్ ఉల్లంఘించాడని పేర్కొంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం కావడంతో అతడిని మందలించి వదిలేశామని ఐసీసీ పేర్కొంది. అలాగే అంపైర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన కారణంగా పంత్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా జోడించారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 61 ఓవర్ లో బంతిని మార్చమని పంత్ ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ ను కోరాడు. బంతి కండీషన్ బాగాలేదని కొత్త బంతి తీసుకు రావాలని అంపైర్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అనం తరం బంతిని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. కండీషన్ బాగానే ఉందని మార్చాల్సిన అవసరం లేదని పంత్ కుచెప్పారు. దీంతో సహనం కోల్పోయిన పంత్ బంతి ని నేలకేసి బలంగా కొట్టి తన కోపాన్ని ప్రదర్శించాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు.

Tags

Next Story