టోక్యో ఒలింపిక్స్లో భారత్ బోణీ

X
భారత పురుషుల హాకీ
By - Gunnesh UV |24 July 2021 10:45 AM IST
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది.
టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో భారత్ -న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. 3-2 తేడాతో భారత హాకీ టీం న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి క్వార్టర్ చివరి వరకు ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్సె ని బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు... తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్ సమం చేసారు. ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే చివర్లో న్యూజిలాండ్ మరో గోల్ సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com