UNDER 19: అండర్ 19 ప్రపంచకప్ జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు

2025 మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మహిళల ఎంపిక కమిటీ వెల్లడించింది. ఈ జట్టుకు నిక్కీ ప్రసాద్ సారథ్యం వహించనుంది. సానికా చల్కే వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్నం అమ్మాయి షబ్నమ్ జట్టులో ఉన్నారు. ఇటీవల జరిగిన మహిళల అండర్-19 ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో గొంగడి త్రిష సత్తా చాటింది. అర్థశతకంతో ఆకట్టుకుంది.
అండర్ 19 భారత జట్టు ఇదే..
నిక్కీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చల్కే (వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమిలిని జి (వికెట్ కీపర్), భవికా అహిరె (వికెట్ కీపర్), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్, జోషితా వీజే, సోనమ్ యాదవ్, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందితా కిశోర్, షబ్నమ్, వైష్ణవి ఎస్.
స్టాండ్బై ప్లేయర్లు..
నందన ఎస్, ఐరా జే, అనధి టి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com