HOCKEY: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

HOCKEY: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
X
ఫైనల్లో చైనాకు షాక్‌ ఇచ్చిన టీమిండియా.. అయిదోసారి ఆసియా ట్రోఫీ కైవసం

భారత హాకీ జట్టు అయిదోసారి మెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాపై 1-0తో విజయం సాధించింది. భారత్-చైనా జట్లు హోరాహోరాగి తలపడడంతో చివరి క్వార్టర్ వరకూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. చివరి క్వార్టర్ లో జుగ్ రాజ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోకుండా కప్పు కైవసం చేసుకుంది.

రెండు జట్ల హోరా హోరీ

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. లీగ్ దశలో చైనాను కూడా టీమిండియా 3-0తో చిత్తు చేసింది. ఇక ఫైనల్లో మరోసారి చైనాతోనే తలపడాల్సి రావడంతో భారత్ విజయం తేలికే అని అంతా అనుకున్నారు. కానీ చైనా తీవ్రంగా పోరాడింది. భారత ఆటగాళ్ల దాడులను కాచుకున్న డ్రాగన్ జట్టు... సమయం చిక్కినప్పుడల్లా భారత గోల్ పోస్ట్ పై దాడులు కూడా చేసింది. అయితే భారత డిఫెన్స్ ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంది. కానీ భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. రెండు జట్లు తీవ్రంగా పోరాడడంతో ఫస్ట్ క్వార్టర్ లో ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. కానీ ఫస్ట్ క్వార్టర్లో భారత్ కు మంచి అవకాశం లభించింది. సుఖ్‌జీత్ చీకీ దాదాపు గోల్ చేసినంత పని చేశాడు. కానీ చైనా గోల్ కీపర్ దాన్ని అద్భుతంగా అడ్డుకున్నాడు. 9వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ అది గోల్ గా మారలేదు. రెండో క్వార్టర్లో భారత్ కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా అవి వృథా అయ్యాయి. ఆ తర్వాత కూడా భారత్ కు కొన్ని అవకాశాలు లభించినా చైనా ఢిఫెన్స్ వాటిని అడ్డుకుంది. దీంతో తొలి సగం ఆట 0-0తో ముగిసింది.

ఆ ఒక్క గోల్‌

మూడో క్వార్టర్ లోనూ భారత్ పదే పదే చైనా డీ ప్రాంతంలోకి దూసుకెళ్లి దాడులు చేసింది. కానీ చైనా డిఫెన్స్ దుర్భేద్యంగా ఉండడంతో గోల్స్ రాలేదు. కానీ 41వ నిమిషంలో చైనా ప్లేయర్ హుందాల్ భారత డీ విభాగంలోకి దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ హుందాల్ షాట్ గోల్ పోస్టుకు దూరంగా వెళ్లడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మూడో క్వార్టర్ లోనూ ఇరు జట్లూ ఎలాంటి గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ నాలుగో క్వార్టర్ కు మళ్లింది.

Tags

Next Story