India Women Team : భారత మహిళా జట్టు విధ్వంసం.. 50 ఓవర్లలో 435 రన్స్

ఐర్లాండ్ మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసింది. ప్రతికా రావల్(154), స్మృతి మంధాన(135) సెంచరీలతో చెలరేగగా, రిచా ఘోష్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్గా నాలుగో స్థానం. గతంలో కివీస్ ఉమెన్ 491/4, 455/5, 440/3 స్కోర్లు చేసి టాప్లో ఉంది.
70 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి మందాన భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. సెంచరీ తర్వాత ఔటైనా.. రిచా ఘోష్ (59) తో ప్రతీక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపింది. ఈ క్రమంలో ప్రతీక్ కెరీర్ లో తొలి సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్ లో రిచా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
ఇక వన్డేల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్గా మహిళల వన్డే క్రికెట్లో నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ మహిళా జట్టు వరుసగా 491/4, 455/5, 430/3 స్కోర్లు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com