ROHIT: మోస్ట్ పవర్ఫుల్ క్రికెటర్గా రోహిత్

ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ముగ్గురు క్రికెటర్లకు చోటు దక్కగా రోహిత్ 48 స్థానంలో నిలిచాడు. గత సంవత్సరం 38వ స్థానం దక్కించుకున్న కోహ్లీ ఈ ఏడాది 72వ స్థానానికి పడిపోయాడు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 83వ స్థానం దక్కించుకున్నాడు. అయితే ఐసీసీ ఛైర్మన్ జై షా 24వ స్థానంలో ఉండటం గమనార్హం.
ఐపీఎల్ లో సారా గ్లామర్ షో!
బీసీసీఐ ఈ సారి IPL సీజన్కు మరింత గ్లామర్ని జోడించింది. మ్యాచ్ ఎక్కడ జరిగిన స్థానిక సెలబ్రెటీలతో బ్లాక్ బస్టర్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంది. ఇటీవల చెన్నైలో అనిరుధ్, హైదరాబాద్లో తమన్ ఈవెంట్లతో అదరగొట్టారు. ఈ క్రమంలోనే మార్చి 30న గువహతిలో జరగనున్న మ్యాచ్లో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ స్పెషల్ పర్ఫామెన్స్ చేయనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఉప్పల్ పిచ్పై మాజీ క్రికెటర్ ఫైర్
సన్రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం నిర్వహణపై ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను తలపించే పిచ్లను తయారు చేస్తే క్రికెట్ ప్రమాదంలో పడుతుందన్నారు. షమీ, కమ్మిన్స్ లాంటి ప్రపంచస్థాయి బౌలర్లు ఫెయిల్ కావడానికి పిచ్ మాత్రమే కారణమన్నారు. అలాగే హైదరాబాద్ ఆటతీరు మార్చుకోకపోతే డిజాస్టర్గా మిగిలిపోతుందన్నారు.
ప్లే-ఆఫ్కు వెళ్లే 4 జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్-2025 సిరీస్లో ప్లే-ఆఫ్కు వెళ్లే జట్ల గురించి చాలా మంది మాజీ ఆటగాళ్లు తమ అంచనాలను ఇస్తున్నారు. ఆ వరుసలో ప్లే ఆఫ్ రౌండ్లోకి వెళ్లే అవకాశం ఉన్న 4 జట్లపై భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తన జోస్యాన్ని వెల్లడించారు. దీని ప్రకారం.. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిళ్లీ ప్లే ఆఫ్ రౌండ్కు చేరుకుంటాయని పఠాన్ చెప్పారు. ఇదే నిజమైతే ఈ జట్లలో ఏది టైటిల్ గెలుచుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com