sachin: ఇంగ్లండ్పై 3-1తో సిరీస్ కైవసం : సచిన్

భారత్, ఇంగ్లండ్ సిరీస్పై క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శుభ్మన్ గిల్ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్పై 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని సచిన్ జోస్యం చెప్పారు. అంతేకాదు, ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, సొంతగడ్డపై ఇంగ్లండ్ను ఓడించడం అంత తేలిక కాదని, అయితే టీమిండియా తలచుకుంటే అది సాధ్యమేనని తెలిపాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు శుక్రవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు మొదలైన సంగతి తెలిసిందే. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది.సొంత నిర్ణయాలే బెస్ట్..కీలక దశలో టీమిండియా టెస్టు జట్టు బాధ్యతలు తీసుకుంటున్న గిల్కు సచిన్ టెండూల్కర్ కీలక సలహాలిచ్చాడు. ఎవరి మాటలు వినకుండా సొంత ప్రణాళికతో ముందుకు సాగిపోవాలని సూచించాడు. ఒక ప్లేయర్ కెప్టెన్గా ఎంపికైన సమయంలో ‘అలా చెయ్.. ఇలా చెయ్..’ అని సలహాలు ఇస్తుంటారని, వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దని సచిన్ చెప్పుకొచ్చాడు
ఏడేండ్ల తర్వాత జట్టులోకి ‘కరుణ్’
దాదాపు ఏడేండ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్. భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం మొదలైన మ్యాచ్లో కరుణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫలో అత్యుత్తమ ప్రదర్శనతో కరుణ్ ఆకట్టుకోవడంతో ఇంగ్లాండ్ పర్యటన కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. 2018లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు కరుణ్ ఎంపికయ్యాడు. అయితే, ఆ సిరీస్ మొత్తం బెంచీకే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి టెస్టు జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం.. కరుణ్కు కలిసొచ్చొందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. "కరుణ్ నాయర్.. రెడీ టు గో..!" అంటూ బీసీసీఐ పోస్టు చేసి, సిరీస్ మొదలయ్యే ముందు అతను మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com