Womens Cricket : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్గా ఆమె నిలిచారు. ఇప్పటివరకు స్మృతి 30సార్లు 50కిపైగా పరుగులు బాదారు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. వీరి తర్వాత బెత్ మూనీ (25), స్టెఫానీ టేలర్ (22), సోఫీ డివైన్ (22), వైట్ (20) ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్ లో 77 పరుగులు చేసిన స్మృతి.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డులకెక్కింది. తాజా ఇన్నింగ్స తో ఈ ఏడాది 21 ఇన్నింగ్స్ లో 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు చమరి ఆటపట్లు (21 ఇన్నింగ్స్-720 పరుగులు) పేరిట ఉండేది. తాజా ఘనతలతో ఈ ఏడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గట్టి పోటీగా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com