T20 WORLDCUP: చితక్కొట్టారు.. కప్పును ఒడిసిపట్టారు

T20 WORLDCUP: చితక్కొట్టారు.. కప్పును ఒడిసిపట్టారు
X
టీ 20 ప్రపంచకప్ టీమిండియా కైవసం... ఫైనల్లో చెలరేగిన భారత బ్యాటర్లు... 159 పరుగులకే పరిమితమైన కివీస్

టీ20 క్రి­కె­ట్‌­లో మరో­సా­రి టీ­మ్‌­ఇం­డి­యా తన సత్తా చా­టిం­ది. అద్భు­త­మైన బ్యా­టిం­గ్‌, కట్టు­ది­ట్ట­మైన బౌ­లిం­గ్‌­తో ప్ర­త్య­ర్థు­ల­ను పూ­ర్తి­గా అదు­పు­లో పె­ట్టి ప్ర­పం­చ­క­ప్‌­ను ఘనం­గా కై­వ­సం చే­సు­కుం­ది. ప్రా­రం­భం నుం­చే దూ­కు­డైన ఆట­తీ­రు­తో మ్యా­చ్‌­పై పట్టు సా­ధిం­చిన భారత జట్టు ఫై­న­ల్లో న్యూ­జి­లాం­డ్‌­ను చి­త్తు­గా ఓడిం­చిం­ది. కీలక సమ­యం­లో ఆట­గా­ళ్లు చూ­పిన ధై­ర్యం, సమ­న్వ­యం, దూ­కు­డు టీ­మ్‌­ఇం­డి­యా­ను జగ­జ్జే­త­గా ని­లి­పా­యి. అభి­మా­నుల ఆశ­ల­ను నె­ర­వే­ర్చు­తూ ప్ర­పం­చ­క­ప్‌­ను గె­లు­చు­కో­వ­డం ద్వా­రా భారత జట్టు మరో­సా­రి ప్ర­పంచ క్రి­కె­ట్‌­లో తన ఆధి­ప­త్యా­న్ని ని­రూ­పిం­చిం­ది.

ఆది­వా­రం జరి­గిన ఫై­న­ల్లో భా­ర­త్‌ 96 పరు­గుల భారీ తే­డా­తో న్యూ­జి­లాం­డ్‌­పై ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. మొదట బ్యా­టిం­గ్‌­కు ది­గిన టీ­మ్‌­ఇం­డి­యా 5 వి­కె­ట్ల నష్టా­ని­కి 255 పరు­గుల భారీ స్కో­రు చే­సిం­ది. ప్ర­పం­చ­క­ప్‌ ఫై­న­ల్లో ఏ జట్టు సా­ధిం­చిన అత్య­ధిక స్కో­రు ఇదే కా­వ­డం వి­శే­షం. సంజు శాం­స­న్‌ (89; 46 బం­తు­ల్లో 5 ఫో­ర్లు, 8 సి­క్స్‌­లు) వి­ధ్వం­స­క­ర­మైన బ్యా­టిం­గ్‌­తో భారత ఇన్నిం­గ్స్‌­కు వె­న్నె­ము­క­లా ని­లి­చా­డు. అత­ని­కి తో­డు­గా అభి­షే­క్‌ శర్మ (52; 21 బం­తు­ల్లో 6 ఫో­ర్లు, 3 సి­క్స్‌­లు), ఇషా­న్‌ కి­ష­న్‌ (54; 25 బం­తు­ల్లో 4 ఫో­ర్లు, 4 సి­క్స్‌­లు) మె­రు­పు అర్ధ­శ­త­కా­ల­తో మె­రి­శా­రు. టా­స్‌ ఓడి బ్యా­టిం­గ్‌­కు ది­గిన భా­ర­త్‌­కు అభి­షే­క్‌, సంజు శాం­స­న్‌­లు అద్భుత ఆరం­భం ఇచ్చా­రు. ఇద్ద­రూ మొ­ద­టి నుం­చే దూ­కు­డు­గా ఆడు­తూ న్యూ­జి­లాం­డ్‌ బౌ­ల­ర్ల­పై ఒత్తి­డి తె­చ్చా­రు. హె­న్రీ బౌ­లిం­గ్‌­లో సంజు భారీ సి­క్స్‌­తో ఖాతా తె­రి­చా­డు. మరో­వై­పు డఫీ ఓవ­ర్లో అభి­షే­క్‌ వరు­స­గా ఫో­ర్లు బా­దా­రు. స్కోరు వేగంగా పెరిగింది. ఇద్దరూ కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. కేవలం 18 బంతుల్లోనే అభిషేక్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టం లేకుండా 92 పరుగులు సాధించింది.

భారీ లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన న్యూ­జి­లాం­డ్‌ ఆరం­భం­లో కొంత ధా­టి­గా ఆడి­నా ఎక్కు­వ­సే­పు ని­ల­వ­లే­క­పో­యిం­ది. భారత బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్‌ చే­స్తూ కి­వీ­స్‌ బ్యా­ట­ర్ల­పై ఒత్తి­డి పెం­చా­రు. మూడో ఓవ­ర్లో­నే ప్ర­మా­ద­కర అలె­న్‌ (9)ను అక్ష­ర్‌ పటే­ల్‌ ఔట్‌ చేసి కి­వీ­స్‌ పత­నా­ని­కి నాం­ది పలి­కా­డు. వెం­ట­నే రచి­న్‌­ను జస్ప్రీ­త్‌ బు­మ్రా వె­న­క్కి పం­పా­డు. తర్వాత ఫి­లి­ప్స్‌ (5)ను అక్ష­ర్‌, చా­ప్‌­మ­న్‌ (3)ను హా­ర్ది­క్‌ ఔట్‌ చే­య­డం­తో న్యూ­జి­లాం­డ్‌ కష్టా­ల్లో పడిం­ది. మరో­వై­పు సీ­ఫ­ర్ట్‌ (52; 26 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, 5 సి­క్స్‌­లు) కొంత ప్ర­తి­ఘ­టన చూ­పి­నా వరు­ణ్‌ అత­డి­ని ఔట్‌ చే­శా­డు. అప్ప­టి­కి కి­వీ­స్‌ స్కో­రు 72/5కు పడి­పో­యిం­ది. అప్ప­టి­కే అవ­స­ర­మైన రన్‌­రే­ట్‌ దా­దా­పు 16కు చే­రు­కో­వ­డం­తో మ్యా­చ్‌ భా­ర­త్‌ వైపు మొ­గ్గు­చూ­పిం­ది. ఆరో వి­కె­ట్‌­కు శాం­ట్న­ర్‌ (43; 35 బం­తు­ల్లో 3 ఫో­ర్లు, 2 సి­క్స్‌­లు) మరి­యు మి­చె­ల్‌ (17) 52 పరు­గుల భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పి­నా మ్యా­చ్‌­ను మలు­పు తి­ప్ప­లే­క­పో­యా­రు. మి­చె­ల్‌­ను అక్ష­ర్‌ ఔట్‌ చే­య­డం­తో ఆ భా­గ­స్వా­మ్యం ము­గి­సిం­ది. అనం­త­రం బు­మ్రా తన అను­భ­వా­న్ని ప్ర­ద­ర్శి­స్తూ వరుస వి­కె­ట్లు తీ­సా­డు. ఒకే ఓవ­ర్లో నీ­ష­మ్‌, హె­న్రీ­ల­ను ఔట్‌ చే­శా­డు. తర్వా­తి ఓవ­ర్లో శాం­ట్న­ర్‌­ను కూడా పె­వి­లి­య­న్‌­కు పం­పా­డు. చి­వ­రి­కి డఫీ­ని అభి­షే­క్‌ ఔట్‌ చే­య­డం­తో న్యూ­జి­లాం­డ్‌ 19 ఓవ­ర్ల­లో 159 పరు­గు­ల­కే ఆలౌ­టైం­ది.

Tags

Next Story