TEAM INDIA: అడుగులు అన్నీ వన్డే ప్రపంచకప్ వైపే

TEAM INDIA: అడుగులు అన్నీ వన్డే ప్రపంచకప్ వైపే
X
టీ 20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. ఇక వన్డే ప్రపంచకప్‌పై దృష్టి.. పక్కా వ్యూహాలు రచిస్తున్న జట్టు..మళ్లీ జట్టులోకి విరాట్, రోహిత్!

భారత క్రి­కె­ట్ మరో­సా­రి ప్ర­పంచ వే­ది­క­పై తన శక్తి­ని చా­టిం­ది. టీ20 ఫా­ర్మా­ట్‌­లో వరుస వి­జ­యా­ల­తో అభి­మా­ను­ల్లో అపా­ర­మైన ఉత్సా­హా­న్ని నిం­పిం­ది. 2007లో తొలి టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను గె­లు­చు­కు­న్న తర్వాత రెం­డో టై­టి­ల్ కోసం భా­ర­త్‌­కు దా­దా­పు 17 సం­వ­త్స­రా­లు ఎదు­రు­చూ­డా­ల్సి వచ్చిం­ది. అయి­తే ఆ ని­రీ­క్షణ ము­గి­సి 2024లో ట్రో­ఫీ­ని సొం­తం చే­సు­కు­న్న భారత జట్టు, ఆ వి­జ­యో­త్సా­హం తగ్గ­క­ముం­దే మరో గొ­ప్ప వి­జ­యా­న్ని అం­దు­కుం­ది. కే­వ­లం 20 నెలల వ్య­వ­ధి­లో మరో టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను గె­లి­చి పరి­మిత ఓవ­ర్ల క్రి­కె­ట్‌­లో తన ఆధి­ప­త్యా­న్ని మరో­సా­రి ని­రూ­పిం­చిం­ది. ఈ వి­జ­యం­తో భారత అభి­మా­ను­లు సం­బ­రా­ల్లో ము­ని­గి­పో­యా­రు. అయి­తే ఇప్పు­డు అం­ద­రి దృ­ష్టి రా­బో­యే వన్డే ప్ర­పం­చ­క­ప్‌­పై ని­లి­చిం­ది. 2027లో జర­గ­ను­న్న ఆ ప్ర­తి­ష్టా­త్మక టో­ర్నీ కోసం ఇప్ప­టి నుం­చే సన్నా­హా­లు ప్రా­రం­భిం­చా­ల్సిన అవ­స­రం స్ప­ష్టం­గా కని­పి­స్తోం­ది.

గత కొ­న్నే­ళ్లు­గా టీ20 క్రి­కె­ట్ ప్ర­భా­వం పె­ర­గ­డం­తో వన్డే మ్యా­చ్‌­ల­కు ఆదరణ కొంత తగ్గి­న­ట్లు కని­పి­స్తోం­ది. అం­తే­కా­కుం­డా వన్డే మ్యా­చ్‌ల సం­ఖ్య కూడా తగ్గిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­న­ప్ప­టి­కీ క్రి­కె­ట్ ప్ర­పం­చం­లో అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­క­మైన టో­ర్నీ­గా ఇప్ప­టి­కీ వన్డే ప్ర­పం­చ­క­ప్‌­కే ప్ర­త్యేక స్థా­నం ఉంది. రెం­డే­ళ్ల­కు ఒక­సా­రి జరి­గే టీ20 ప్ర­పం­చ­క­ప్‌­తో పో­లి­స్తే నా­లు­గే­ళ్ల­కు ఒక­సా­రి జరి­గే వన్డే ప్ర­పం­చ­క­ప్‌­కు ఆట­గా­ళ్లు, అభి­మా­ను­లు రెం­డు­వ­ర్గా­లూ మరింత ప్రా­ధా­న్యత ఇస్తా­రు. ఆ టో­ర్నీ­లో వి­జే­త­గా ని­ల­వ­డం ప్ర­తి జట్టు కల. భారత జట్టు ఇప్ప­టి­వ­ర­కు రెం­డు సా­ర్లు ఈ ఘన­త­ను అం­దు­కుం­ది. 1983లో కపి­ల్ దేవ్ నా­య­క­త్వం­లో­ని జట్టు తొలి ప్ర­పం­చ­క­ప్‌­ను సా­ధిం­చి చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. అనం­త­రం 2011లో మహేం­ద్ర సిం­గ్ ధోనీ కె­ప్టె­న్సీ­లో భా­ర­త్ మరో­సా­రి ప్ర­పం­చ­క­ప్‌­ను సొం­తం చే­సు­కుం­ది. అయి­తే ఆ తర్వాత జరి­గిన మూడు వన్డే ప్ర­పం­చ­క­ప్‌­ల­లో భా­ర­త్‌­కు ని­రా­శే ఎదు­రైం­ది. ము­ఖ్యం­గా 2023లో అద్భు­త­మైన ప్ర­ద­ర్శన చే­సి­న­ప్ప­టి­కీ ఫై­న­ల్లో ఓట­మి­తో టై­టి­ల్ చే­జా­రిం­ది.

ఇప్పు­డు దక్షి­ణా­ఫ్రి­కా, జిం­బా­బ్వే, నమీ­బి­యా సం­యు­క్తం­గా ఆతి­థ్య­మి­వ్వ­ను­న్న 2027 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­పై టీమ్ ఇం­డి­యా ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టిం­ది. వరు­స­గా రెం­డు టీ20 ప్ర­పం­చ­క­ప్‌­లు గె­లి­చిన జట్టు అదే జో­ష్‌­తో వన్డే ప్ర­పం­చ­క­ప్‌­ను కూడా గె­ల­వా­ల­ని అభి­మా­ను­లు ఆశి­స్తు­న్నా­రు. అయి­తే ఆ లక్ష్యం సా­ధిం­చా­లం­టే ముం­దు­గా­నే సరైన వ్యూ­హా­ల­తో ముం­దు­కు సా­గా­ల్సి ఉం­టుం­ది. ఇటీ­వల జరి­గిన టీ20 ప్ర­పం­చ­క­ప్ వి­జ­యా­ని­కి కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ మరి­యు కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ రూ­పొం­దిం­చిన ప్ర­ణా­ళి­క­లు కీలక పా­త్ర పో­షిం­చా­యి. టో­ర్నీ­కి చాలా ముం­దు­గా­నే జట్టు­పై ఒక స్ప­ష్ట­మైన అం­చ­నా­కు వచ్చి, యువ ఆట­గా­ళ్ల­కు వి­స్తృ­తం­గా అవ­కా­శా­లు కల్పిం­చా­రు. ఆ ని­ర్ణ­యం ఫలి­తం­గా అభి­షే­క్ శర్మ, తి­ల­క్ వర్మ వంటి యువ ఆట­గా­ళ్లు జట్టు­లో కీలక సభ్యు­లు­గా ఎది­గా­రు. ఇటీవల జరిగిన మూడు వన్డే సిరీస్‌లలో రోహిత్, కోహ్లి ఇద్దరూ అద్భుతంగా రాణించారు. ఫిట్‌నెస్ పరంగానూ ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ గతంతో పోలిస్తే బరువు తగ్గి మరింత ఫిట్‌గా మారినట్లు కనిపిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ మంచి ప్రదర్శన చేస్తే 2027 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతం అవుతుంది. వీరిద్దరూ ఫిట్‌నెస్‌ను కొనసాగించాలి.

Tags

Next Story