TEAM INDIA: శ్రీలంకను తేలిగ్గా తీసుకోబోం

టీ 20 ప్రపంచకప్లో కీలక పోరుకు భారత జట్టు సిద్ధమైంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన తర్వాత భారత్ సెమీస్ రేసులో నిలిచింది. లంకతో జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించి సెమీస్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది. అయితే ఆసియా కప్ ఫైనల్లో భారత్ను ఓడించి శ్రీలంక విజయం సాధించడం టీమిండియాను కలవరపరుస్తోంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టాపార్డర్ విఫలం కావడం కూడా భారత్ను ఆందోళన పరుస్తోంది. అయితే శ్రీలంకను తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదని విధ్వంసకర ఓపెనర్ షెఫాలి వర్మ పేర్కొంది. శ్రీలంక జట్టు ఇప్పుడు చాలా బలంగా మారిందని.. ఆసియా జట్టులో ఆ జట్టు ప్రదర్శన చూశామని తెలిపింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మ్యాచ్ అన్నింటికంటే కీలకమని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. వంద శాతం ప్రదర్శన ఇచ్చి మ్యాచులు గెలుస్తామని వెల్లడించింది.
ఇంగ్లాండ్కు రెండో విజయం
మహిళల టీ 20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ విజయ పరంపర కొనసాగుతోంది. బ్రిటీష్ జట్టు.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 124 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని కేవలం మూడే వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 71 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ప్రొటీస్ మంచి స్థితిలోనే నిలిచింది. అనెకె బాష్ 18 పరుగులు, మరిజేన్ కాప్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. బ్రిటీష్ బౌలర్లలో సోఫీఎకిల్స్టోన్ 2 వికెట్లు, సారా గ్లెన్, చార్లీ డీన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ .... 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాట్ సీవర్ 36 బంతుల్లో ఆరు ఫోర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సీవర్ పోరాటంతో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా నడిచింది. డానీ వ్యాట్ కూడా ధాటిగా ఆడింది. కేవలం 43 బంతుల్లో నాలుగు ఫోర్లతో 43 పరుగులు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com