TEAM INDIA: హీరోల్లా నిలిచారు.. ప్రపంచాన్నే గెలిచారు

TEAM INDIA: హీరోల్లా నిలిచారు.. ప్రపంచాన్నే గెలిచారు
X
కష్టాల్లో పుట్టుకొచ్చిన కొత్త హీరోలు

ప్ర­పం­చ­క­ప్‌ గె­ల­వా­లం­టే సా­ధా­ర­ణం­గా ఒక జట్టు­లో భీ­క­ర­మైన ఆట­గా­ళ్లు ఉం­డా­లి, ప్ర­త్య­ర్థి జట్ల­ను భయ­పె­ట్టే స్థా­యి ప్ర­ద­ర్శన చే­యా­లి, ప్ర­తి మ్యా­చ్‌­లో సమ­ష్టి­గా రా­ణిం­చా­లి అనే అభి­ప్రా­యం ఉం­టుం­ది. టో­ర్నీ మొ­త్తం ఒకే వి­ధ­మైన ఆధి­ప­త్యం చూ­పిన జట్టే చి­వ­ర­కు ట్రో­ఫీ­ని అం­దు­కుం­టుం­ద­ని అను­కుం­టా­రు. కానీ ఈసా­రి కథ పూ­ర్తి­గా భి­న్నం­గా సా­గిం­ది. కొ­న్ని­సా­ర్లు తడ­బ­డు­తూ, కొ­న్ని­సా­ర్లు ఒత్తి­డి­ని ఎదు­ర్కొం­టూ, ఒక్కో మ్యా­చ్‌­లో ఒక్కో ఆట­గా­డు హీ­రో­గా ని­లు­స్తూ ముం­దు­కు సా­గిన టీ­మిం­డి­యా చి­వ­ర­కు టీ20 ప్ర­పం­చ­క­ప్‌ 2026ను కై­వ­సం చే­సు­కుం­ది. ప్ర­ద­ర్శన పరం­గా ఇది ‘పర్ఫె­క్ట్‌’ టో­ర్నీ కా­క­పో­యి­నా, పో­రా­ట­స్ఫూ­ర్తి­తో సా­ధిం­చిన ఈ వి­జ­యం మా­త్రం ఎంతో ప్ర­త్యే­కం­గా ని­లి­చిం­ది.

సూర్య నేతృత్వం

సొం­త­గ­డ్డ­పై టో­ర్నీ జర­గ­డం వల్ల కె­ప్టె­న్‌ సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ నే­తృ­త్వం­లో­ని భారత జట్టు­పై కొంత ఆశలు ఉం­డే­వి. అయి­తే కచ్చి­తం­గా కప్పు గె­లు­స్తుం­ద­నేంత నమ్మ­కం మా­త్రం అభి­మా­ను­ల్లో కని­పిం­చ­లే­దు. టో­ర్నీ ప్రా­రంభ దశలో భా­ర­త్‌ ప్ర­త్య­ర్థి జట్ల­పై భీ­క­ర­మైన ఆధి­ప­త్యం చూ­పిం­చ­లే­దు. కొ­న్ని మ్యా­చ్‌­ల్లో జట్టు ఆట తడ­బ­డిం­ది. అం­చ­నా­లు పె­ట్టు­కు­న్న కొం­ద­రు ఆట­గా­ళ్లు కూడా ఆశిం­చిన స్థా­యి­లో రా­ణిం­చ­లే­క­పో­యా­రు. దీం­తో ఒక దశలో భా­ర­త్‌ సె­మీ­ఫై­న­ల్‌ చే­రు­తుం­దా లేదా అన్న సం­దే­హా­లు కూడా వ్య­క్త­మ­య్యా­యి.ఈ పరి­స్థి­తి అభి­మా­ను­ల­కు 2023 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­ను గు­ర్తు చే­సిం­ది. ఆ టో­ర్నీ­లో భా­ర­త్‌ అద్భు­తం­గా ఆడు­తూ ప్ర­తి ప్ర­త్య­ర్థి­ని ఓడిం­చి అజే­యం­గా ఫై­న­ల్‌ చే­రిం­ది. అప్ప­టి­కి రో­హి­త్‌ శర్మ సేన ఆధి­ప­త్యం చూసి కప్పు దా­దా­పు భా­ర­త్‌­కే ఖా­య­మ­ని అని­పిం­చిం­ది. కానీ ఫై­న­ల్లో ఆస్ట్రే­లి­యా సం­చ­లన వి­జ­యం­తో ట్రో­ఫీ­ని చే­జి­క్కిం­చు­కుం­ది. ఆ బాధ ఇంకా అభి­మా­నుల మన­సు­ల్లో ఉం­డ­గా­నే ఈసా­రి టీ20 ప్ర­పం­చ­క­ప్‌ భా­ర­త్‌­లో జరి­గిం­ది. యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఐపీఎల్‌ వంటి టోర్నీల అనుభవం వల్ల అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ వంటి యువ క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగారు. ఫైనల్‌కు ముందు వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్‌ శర్మ తుదిపోరులో అర్ధశతకం సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. అభిషేక్‌ విఫలమైన మ్యాచ్‌ల్లో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బాధ్యత తీసుకుని జట్టుకు కీలక పరుగులు అందించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసింది.

సంజు శాం­స­న్‌ కూడా ఈ టో­ర్నీ­లో జట్టు వి­జ­యా­ల్లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. వె­స్టిం­డీ­స్‌­తో జరి­గిన కీలక మ్యా­చ్‌­లో 196 పరు­గుల భారీ లక్ష్యా­న్ని ఛే­దిం­చే సమ­యం­లో భా­ర­త్‌ ఒత్తి­డి­లో పడగా, అతను అద్భు­త­మైన ఇన్నిం­గ్స్‌­తో జట్టు­ను గె­లి­పిం­చా­డు. ఆ మ్యా­చ్‌­లో అతను చే­సిన 97 నా­టౌ­ట్‌ జట్టు ప్ర­యా­ణా­న్ని మలు­పు­తి­ప్పిన ఇన్నిం­గ్స్‌­గా ని­లి­చిం­ది. తర్వాత సె­మీ­ఫై­న­ల్‌, ఫై­న­ల్లో కూడా సంజు తన బ్యా­టిం­గ్‌­తో ప్ర­భా­వం చూ­పిం­చా­డు. తి­ల­క్‌ వర్మ లీ­గ్‌ దశలో ఆశిం­చిన స్థా­యి­లో రా­ణిం­చ­క­పో­యి­నా సూ­ప­ర్‌–8 దశ నుం­చి తన ప్ర­తి­భ­ను చూ­పిం­చా­డు.

Tags

Next Story