ASIA CUP: భారత నుదిటిపై విజయ తిలకం

ASIA CUP: భారత నుదిటిపై విజయ తిలకం
X
ఆసియా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... ఉత్కంఠభరిత ఫైనల్లో పాక్‌పై ఘన విజయం

నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న ఆధిక్యం... గెలిచి తీరాలన్న పట్టుదల.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ...వెరసి ఆసియా కప్ ఫైనల్లో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. దాయాదిని చావు దెబ్బ కొడుతూ పాకిస్థాన్ పై ఉత్కంఠభరిత విజయం సాధించి టీమిండియా ఆసియా కప్ కైవసం చేసుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కదనరంగంలో విజృంభిస్తున్న శత్రు సైన్యానికి ధైర్యంగా ఎదురు నిలిచిన సైనికుడిలా నిలబడ్డాడు. జీవిత కాల ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఆసియా కప్ లో మూడుసార్లు దాయాదిని మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఆసియా కప్ ను కైవసం చేసుకుంది.

ఆసి­యా కప్‌ 2025 వి­జే­త­గా టీ­మిం­డి­యా అవి­ర్భ­విం­చిం­ది. జరి­గిన ఫై­న­ల్లో పా­కి­స్తా­న్‌­పై 5 వి­కె­ట్ల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చిం­ది. ఉత్కం­ఠ­గా సా­గిన ఈ లో స్కో­రిం­గ్‌ టా­స్‌ ఓడి తొ­లుత బ్యా­టిం­గ్‌­కు ది­గిన పా­క్‌.. కు­ల్దీ­ప్‌ యా­ద­వ్‌ (4-0-30-4) ధా­టి­కి 19.1 ఓవ­ర్ల­లో 146 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. ఓపె­న­ర్లు సా­హి­బ్‌­జా­దా ఫర్హా­న్‌ (57), ఫక­ర్‌ జమా­న్‌ (46) రా­ణిం­చ­డం­తో పా­క్‌ తొ­లుత భారీ స్కో­ర్‌ చే­సే­లా కని­పిం­చిం­ది. 11.2 ఓవ­ర్ల­లో కే­వ­లం​ వి­కె­ట్‌ మా­త్ర­మే కో­ల్పో­యి 100 పరు­గుల మా­ర్కు­ను తా­కిన ఆ జట్టు.. భారత బౌ­ల­ర్లు ఒక్క­సా­రి­గా లై­న్‌­లో­కి రా­వ­డం­తో తట్టు­కో­లే­క­పో­యిం­ది. 33 పరు­గుల వ్య­వ­ధి­లో ఆ జట్టు చి­వ­రి 9 వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. భారత బౌ­ల­ర్ల­లో కు­ల్దీ­ప్‌­తో పాటు అక్ష­ర్‌ పటే­ల్‌ (4-0-26-2), వరు­ణ్‌ చక్ర­వ­ర్తి (4-0-30-2), బు­మ్రా (3.1-0-25-2) కూడా సత్తా చా­టా­రు. పా­క్‌ ఇన్నిం­గ్స్‌­లో ఓపె­న­ర్ల­తో పాటు వన్‌ డౌ­న్‌ బ్యా­ట­ర్‌ సై­మ్‌ అయూ­బ్‌ (14) మా­త్ర­మే రెం­డం­కెల స్కో­ర్‌ చే­శా­రు. అనం­త­రం 147 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన భా­ర­త్ కు ఆరం­భం­లో కష్టా­లు తప్ప­లే­దు.

భారత్‌ అంత పేలవంగా మొదలెట్టింది. 20కే 3 వికెట్లు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ పరిస్థితిది. టోర్నీలో అద్భుత ఆరంభాలనిచ్చిన అభిషేక్‌ (5) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం భారత్‌కు తొలి దెబ్బ. పేలవ షాట్‌ సెలక్షన్‌తో ఇంకొద్దిసేపట్లోనే సూర్య (1), గిల్‌ (12) పెవిలియన్‌ బాట పట్టారు.తిలక్‌ వర్మ. ఒత్తిడినంతా తట్టుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. శాంసన్‌ కాస్త ఇబ్బంది పడ్డా కొన్ని షాట్లు ఆడడంతో 12 ఓవర్లలో 76/3తో భారత్‌ కోలుకుంది. శాంసన్‌ (24) ఓ అనవసర షాట్‌కు యత్నించి ఔట్‌ కావడంతో భారత్‌పై మళ్లీ ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఆరు ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ దశలో తిలక్‌ జోరు పెంచాడు.గెలవాలంటే ఆఖరి ఓవర్లో భారత్‌ 10 పరుగులు చేయాల్సిన స్థితి. మళ్లీ తిలకే బాధ్యత తీసుకున్నాడు. తొలి బంతికి 2 పరుగులు తీసిన అతడు రెండో బంతికి స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టి భారత శిబిరంలో సంతోషాన్ని నింపాడు. తర్వాతి బంతికి అతడు సింగిల్‌ తీయగా.. రింకు ఫోర్‌తో ఛేదనను పూర్తి చేశాడు.

Tags

Next Story