Virat Kohli : విదేశాల్లోనూ ప్రత్యర్థులను భయపెట్టడంలో కోహ్లీ సక్సెస్ : హర్భజన్ సింగ్‌

Virat Kohli : విదేశాల్లోనూ ప్రత్యర్థులను భయపెట్టడంలో కోహ్లీ సక్సెస్ : హర్భజన్ సింగ్‌
X

విదేశాల్లోనూ భారత్ ను చూసి ప్రత్యర్థులు భయపడే పరిస్థితిని తీసుకురావడంలో కింగ్ కోహ్లీ విజయవంతమయ్యాడని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీరుపై హర్భజన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో జట్టును నడిపించిన విధానం అద్భుతమని ప్రశంసించాడు. విదేశీ గడ్డపైనా గెలవాలనే కసిని ఆటగాళ్లలో పెంచాడని భజ్జీ కొనియాడాడు. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేనంత మాత్రాన గొప్ప నాయకుడు కాకుండా పోడని అన్నారు. ‘విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్‌ ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. వరల్డ్‌ కప్‌లను సాధించలేదు. అదేమీ అతడిని అద్భుతమైన నాయకుడిగా పిలవకుండా ఆపలేదు. జట్టులో విజయం సాధించాలనే కాంక్షను కోహ్లీ పుట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 400 పరుగుల టార్గెట్‌ను ఛేదించడమంటే సాధారణ విషయం కాదు. అలాంటప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా జట్టు విజయం సాధించిందంటే దానికి కారణం కెప్టెన్. జట్టులోని ప్రతి క్రికెటర్‌కూ అలాంటి గట్స్‌ను నేర్పించాడు. చివరి వరకూ పోరాడే తెగువ తీసుకొచ్చాడు. గబ్బాలో శుభ్‌మన్ గిల్, రిషభ్‌ పంత్ ఆడిన తీరు ఎప్పటికీ మరువలేం. అప్పట్నుంచే భారత జట్టు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. విదేశాల్లోనూ టమిండియాను చూస్తే ప్రత్యర్థులు హడలెత్తేలా చేయడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే భారత్‌ తొలిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. 2018/19 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2021/22లోనూ మళ్లీ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టేందుకు నవంబర్‌లో మరోమారు ఆసీస్‌ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఈసారి ఐదు టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

Tags

Next Story