TNSF నేతలకు సంఘీభావం తెలుపుతూ గుంటూరు సబ్జైల్కు వెళ్లిన నారా లోకేష్
ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై దొంగ కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు నారా లోకేష్. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరితే అరెస్టులు చేయడం, విద్యార్థులపై రేప్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.
పేద ప్రజలు ఉన్నత విద్య చదువుకో కూడదా అని ప్రశ్నించారు. YCP ఇరవై నెలల పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలున్నా హోదాను గాలిలోకి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. TNSF నేతలు గుంటూరు సబ్జైల్ నుంచి విడుదలైన సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలిపారు.
లక్షలాది మంది పేదవిద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేయడమే @ApTnsf నేతలు చేసిన నేరమా? జగన్రెడ్డిని రేప్ చేయడానికొచ్చారని కేసు పెట్టారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలంటే ఎందుకంత భయం @ysjagan? pic.twitter.com/iBkaWcjTph
— Lokesh Nara (@naralokesh) January 29, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com