తెలంగాణలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
By - Admin |22 Aug 2020 2:21 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,01,865 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2474 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు శనివారం వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 447 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,01,865 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 744కు చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకొని మొత్తం 78,735 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22,386 మంది మంది హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 15,931 మంది ఉన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com